హైదరాబాద్ : సింగరేణిపై కేంద్రం కుట్రకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. కేంద్రం కుట్రను బండి సంజయ్ అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. కోయలగూడెం మూడో కోల్ బ్లాక్ కేంద్రాన్ని ప్రయివేటు సంస్థకు అప్పగించారు. ఆగస్టు 10వ తేదీన వేలం ద్వారా ఔరో కోల్ ప్రయివేటు సంస్థకు అప్పగించారని గుర్తు చేశారు. కోల్ బ్లాక్స్ లేకుంటే సింగరేణి సంస్థ ఏ పని చేయాలని ప్రశ్నించారు. కేంద్రం కావాలనే సింగరేణిని నిర్వీర్యం చేస్తోందని వినోద్ కుమార్ మండిపడ్డారు.