కరీంనగర్ : ఇటీవల కురిసిన వడగండ్ల వానకు(Hail rain) పంట నష్టపోయిన రైతులకు పరిహారం (Compensation) ఇచ్చి ఆదుకోవాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్(Vinod Kumar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను మంగళవారం ఆయన పార్టీ శ్రేణులతో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీంచారు.
ముస్తాబాద్, పోతుగల్, సేవాలాల్తండా, గన్నెవానిపల్లెలో పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు.
రైతులు కష్టపడి పండించిన పంటలు 15 రోజుల్లో కోతలకు వచ్చే సమయంలో మొన్నటి వరకు సాగునీరు లేక, కరెంటు రాక అల్లాడారని గుర్తుచేశారు.
కొందరు కడుపు మండి పశువులను మేపారని, మరికొందరు పంటలకు అగ్గి పెట్టుకుని అన్నమో రామచంద్రా అంటున్న సమయంలోనే ప్రకృతి కన్నెర్రచేసి వడగండ్ల వానతో పూర్తిగా నష్టపరిచి వారిని మరింత కుంగ దీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితి మరింత దిగజారకముందే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు.