హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): హైకోర్టు న్యాయవాదుల సమస్యలను పరిషరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ కొత్త కార్యవర్గ సభ్యులు ఆదివారం బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో వినోద్కుమార్తో సమావేశమయ్యారు. కొత్త కార్యవర్గానికి వినోద్కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వినోద్కుమార్ దృష్టికి న్యాయవాదులు తీసుకొచ్చారు.
హైకోర్టులోని మెడికల్ డిస్పెన్సరీని అప్గ్రేడ్ చేసి వైద్య సిబ్బందిని నియమించాలని, లైబ్రరీకి నిధులు మంజూరు చేయాలని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన శిక్షణ పొందే న్యాయవాదులకు స్టాండింగ్ కౌన్సిల్గా అవకాశాలు కల్పించాలని, జూనియర్ న్యాయవాదులకు ైస్టెఫెండ్ మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చెంగల్వ కల్యాణ్రావు, కార్యదర్శి దేవేందర్, కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.