కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రజలకు సూచన
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): కరోనా తీవ్రత నేపథ్యంలో వినాయక చవితి పండుగను ఎవరికి వారు తమ ఇండ్లలోనే నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రజలందరికీ సూచిస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మట్టి గణపతుల విగ్రహాలకే పూజలు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తామని తెలిపింది. గణేశ్, దుర్గామాత విగ్రహాలను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చే యడంపై నిషేధం విధించాలని, గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదని దాఖలైన కోర్టు ధికార పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బీ విజయసేన్రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. రసాయనాలతో తయారుచేసిన విగ్రహాలను నిమజ్జనం చేయకుండా తీసుకునే చర్యలను సెప్టెంబర్ 1 లోగా నివేదించాలని జీహెచ్ ఎంసీ కమిషనర్, నగర పోలీసు కమిషనర్లను ఆదేశించింది.
ఫ్రీగా 1.20 లక్షల మట్టి విగ్రహాలు
హెచ్ఎండీఏ 70 వేలు, జీహెచ్ఎంసీ 50 వేలు చొప్పున మొత్తం లక్షా 20 వేల మట్టి గణపతుల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్ బుధవారం కౌంటర్ దాఖలు చేశారు.