హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో తెలంగాణ పల్లెలను మెరిపించి, మురిసేలా చేశామని, అనేక సదుపాయాలు కల్పించి ఆదర్శంగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. గురువారం శాసనసభలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా మాట్లాడారు. దేశాభివృద్ధికి పట్టుగొమ్మలైన పల్లెలు గత ప్రభుత్వాల హయాంలో మురికి కూపాలుగా మారి, దయనీయ స్థితిలో ఉండేవన్నారు. కూలిపోయిన ఇండ్లు, పాడుబడ్డ బావులు, పూడ్చకుండా వదలేసిన బోరు బావులు, పిచ్చి మొకలు, దోమలకు నిలయాలైన నీటి గుంతలతో పల్లెలు అపరిశుభ్రంగా, దుర్గంధభరితంగా కనిపించేవని గుర్తుచేశారు. గ్రామీణ పారిశుధ్యం నిరంతర ప్రక్రియగా కొనసాగడం కోసం, గ్రామ పరిధిలో నాటిన మొకలు చకగా పెంచడం కోసం, గ్రామం నుంచి చెత్తాచెదారం తరలించడం కోసం కావాల్సిన సాధనాలను ప్రభుత్వం సమకూర్చిందన్నారు. రాష్ట్రంలోని 16 గ్రామాలు మినహా అన్ని గ్రామాల్లో డంప్ యార్డు ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. గ్రామంలో పోగయ్యే చెత్తను నిత్యం సేకరించి డంప్ యార్డుకు తరలించడానికి కావాల్సిన ట్రాలీ, మొక్కలకు నీళ్లు పోసేందుకు ట్యాంకర్తో కూడిన ట్రాక్టర్లను సమకూర్చామని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో ట్రాక్టర్లున్న పంచాయతీలు 87 ఉంటే, టీఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఫలితంగా ఇప్పుడు ప్రతి పంచాయతీ ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను కలిగి ఉన్నదని తెలిపారు. చెత్త సేకరణ, విసర్జన, నాటిన మొక్కల పరిరక్షణ సమర్థంగా జరుగుతుండటంతో తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శంగా రూపొంది, పచ్చగా పరిశుభ్రంగా కళకళలాడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
పార్టీలకు అతీతంగా నిధులు
సీఎంగా నేను జిల్లాలకు వెళ్లినప్పుడు సొంత పార్టీ, ఇతర పార్టీ అనే తేడా లేకుండా నిధులు ఇచ్చిన. సీఎం ఫండ్ నుంచి జిల్లాలకు రూ.949 కోట్లు ఇచ్చాం. 15వ ఆర్థికసంఘం వాళ్లు గ్రామ పంచాయతీలకు వాటా పెట్టారు కానీ జిల్లా పరిషత్తులకు, మండల పరిషత్తులకు ఏమీ ఇవ్వలేదు. దీంతో జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు.. ‘కేంద్రంఎలాగూ పట్టించుకోలేదు.. మీరు కూడా పట్టించుకోరా!’ అని గొడవ చేశారు. దీంతో మేమే ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టి రూ.500 కోట్లు ఇచ్చినం. ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన డబ్బులే కాకుండా కేంద్ర నుంచి ఎలాంటి సాయం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా, మండల పరిషత్తుల అభివృద్ధికి రూ.1500 కోట్లు ఇచ్చినం. ఇంకా రాష్ట్రం గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తలేదు అంటే.. ఈ లెక్కలు చూస్తే నిధులు ఇచ్చినట్లా? ఇవ్వనట్లా?
వీధి వీధినా విద్యుత్ వెలుగులు..
గత ప్రభుత్వాల హయాంలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. 4 విడతల పల్లె ప్రగతి సందర్భంగా ప్రభుత్వం వీధి దీపాల సమస్యను సంపూర్ణంగా పరిషరించింది. రూ.330 కోట్ల ఖర్చుతో 2,33,135 కొత్త స్తంభాలను అమర్చింది. కరెంటు తీగలను పటిష్టంచేశాం. గతంలో నిర్లక్ష్యానికి గురైన దళిత, గిరిజన ఆవాసాల్లో 50,230 కిలోమీటర్ల మేర థర్డ్వైర్ను ఏర్పాటుచేశాం. కేంద్రానికి చెందిన ఈఈఎస్ఎల్ సంస్థతో ఒప్పందం ద్వారా అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటుకానున్నాయి.
ఇంటింటికీ మంచి నీరు సరఫరా
టీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉండేలా సుమా రు 40 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ వల్ల గ్రామీణ ప్రజలు నిత్యం శుద్ధిచేసిన నదీజలాలను మంచినీటిగా పొందుతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, సర్పంచులకు బిల్లుల భారం తప్పింది. ప్రతి ఇంటికీ నల్లా బిగించి, రోజూ పరిశుభ్రమైన మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని కేంద్రం ఇటీవల పార్లమెంటు సాక్షిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ ఫ్లోరైడ్ రహితమని పార్లమెంటు వేదికగా కేంద్రం ప్రకటించింది. మిషన్ భగీరథ ప్రేరణతో కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ జల్’ అనే పేరుతో ఇంటింటికీ నీరందించే పథకాన్ని ప్రవేశపెట్టింది.
గౌరవప్రదంగా అంత్యక్రియలు
మరణించిన వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు జరపడానికి వసతులు లేక గతంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. భూమిలేని నిరుపేదలైతే వారి వేదన వర్ణనాతీతం. ఈ అనాగరిక పరిస్థితిని మార్చి తీరాలని మా ప్రభుత్వం ఊరూరా వైకుంఠధామాలు నిర్మించింది. వీటిలో అంత్యక్రియలకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటుచేసింది. 1547 కోట్ల వ్యయంతో ప్రతి గ్రామపంచాయతీలో వైకుంఠధామాలు నిర్మించింది. ప్రస్తుతం 12,660 వైకుంఠధామాల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 109 గ్రామాల్లో నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి.
హరిత యజ్ఞంలో పంచాయతీరాజ్ ఉజ్వల పాత్ర
రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ యజ్ఞంలో పంచాయతీరాజ్ శాఖ ఉజ్వల పాత్ర పోషిస్తున్నది. గత ప్రభుత్వాల హయాంలో ఏ గ్రామంలోనూ మొక్కలను పెంచిన దాఖలా లేదు. విచక్షణారహితంగా అడవులు, చెట్ల నరికివేత వల్ల అనేక ప్రకృతి విపరిణామాలు ఎదురొన్నాం. నూతన పంచాయతీరాజ్ చట్టం వెలుగులో అన్ని గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటుచేసి, గ్రామ పరిసరాలను హరితవనాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. అవి హరితయజ్ఞానికి అద్భుతంగా దోహదపడుతున్నాయి. గత ప్రభుత్వాల కాలంలో పారులు, ఉద్యానవనాలు కొన్ని పట్టణ ప్రాంతాలకే పరిమితమైతే.. నేడు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలతోపాటు అతి చిన్న ఆవాస ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకొని 13,657 ఎకరాల విస్తీర్ణంలో, 19,472 ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇతర సౌకర్యాలు కల్పించింది. ప్రతి మండలానికి 5 చొప్పున బృహత్ ప్రకృతివనాలు ఏర్పాటుచేస్తున్నాం. వీటిలో 120 వనాల ఏర్పాటు పూర్తయింది. అన్ని గ్రామాల పరిధిలో 65.67 కోట్ల మొకలు నాటి సంరక్షిస్తున్నాం. నాటిన మొక్కల్లో 90-95% పెరుగుతున్నాయి. అన్ని పంచాయతీలు తమ బడ్జెట్లలో 10% నిధులు విధిగా గ్రీన్ బడ్జెట్కు కేటాయించాలని ప్రభుత్వం నిర్దేశించింది.
పంచాయతీరాజ్ కృషికి జాతీయ స్థాయి అవార్డులు
1.గందగీ ముక్త్ భారత్-2020 అవార్డ్..
తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం (స్టేట్ క్యాటగిరీ)
కరీంనగర్ జిల్లా మూడో స్థానం (జిల్లా క్యాటగిరీ)
సిద్దిపేట జిల్లా ఉత్తమ ప్రదర్శన
2.స్వచ్ఛ సుందర్ శౌచాలయ్-2019
తెలంగాణ రెండవ స్థానం (స్టేట్ క్యాటగిరీ)
పెద్దపల్లి జిల్లా మొదటి స్థానం (జిల్లా క్యాటగిరీ)
3.స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2019
తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానం
4.స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2018
తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానం