సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి, ప్యారానగర్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ రెండు గ్రామాల సమీపంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డును(Dumping yard) వ్యతిరేకిస్తూ గ్రామస్తులు సెల్ టవర్(Cell tower) ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డంప్ యార్డు ఏర్పాటును విరమించే వరకు సెల్ టవర్ దిగమంటూ హెచ్చరించారు.
అలాగే డంప్ యార్డును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఉదయం నుంచి నిరవధికంగా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. గుమ్మడిదల మండల కేంద్రంలో డంపింగ్ యార్డ్ వద్దంటూ బీఆర్ఎస్ నాయకులు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకునేంత వరకు ఉద్యమిస్తామన్నారు.