Kothagudem | చర్ల, మార్చి 27 : పాఠశాలకు తప్పతాగి రావడమేగాక విద్యార్థులను అకారణంగా కొట్టడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఉపాధ్యాయుడిని తరగతి గదిలో నిర్బంధించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీ పల్లి ప్రభుత్వ పాఠశాలలో బుధవారం చోటుచేసుకున్నది. ఇన్చార్జి హెచ్ఎంగా పనిచేస్తున్న కిషన్ బుధవారం మద్యం తాగి విధులకు హాజరయ్యాడు.
మద్యం మత్తు లో విద్యార్థులను కొట్టడం మొదలుపెట్టాడు. విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు చేరడంతో వారు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడిని నిలదీశారు. దురుసుగాచెప్పడంతో నిర్బంధించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ నేత వసంత తెలిపారు.