అబిడ్స్, మార్చి 22: హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణా న్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆదివారం ఆందోళనకు దిగారు. తమ నివాసాలను కూల్చి దవాఖానను నిర్మించొద్దంటూ ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించి, గోషామహల్ చౌరస్తాలో ధర్నా చేశారు. ఆ ప్రాంతంలో రహదారులు, నాలా విస్తరణ కోసం భవన యజమానుల నుంచి స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడంపై మండిపడ్డారు.
దవాఖాన ని ర్మాణం, రహదారుల విస్తరణ వల్ల వంద ల మంది భవన యజమానులు ఆస్తులు కోల్పోనున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాలున్నప్పటికీ ప్రభుత్వం తమ ప్రాంతంలోనే నిర్మించేందుకు చర్యలు చేపట్టడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరసనతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి, అక్కడి నుంచి పంపేశారు.