హైదరాబాద్ : ములుగు జిల్లాలోని చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా గుర్తింపు దక్కడం తెలంగాణ వారసత్వ సంపదకు దక్కిన గొప్ప గుర్తింపుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడం యావత్ దేశానికి ఆనందకరమైన విషయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రామప్ప ఆలయం భారతీయ ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. భారతీయ శిల్పకళకు చక్కని ఉదాహరణ.. రామప్ప గుడి అని చెప్పారు.