హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రైల్వేశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్కు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ లేఖ రాశారు.
దేశవ్యాప్తంగా రైల్వేలో 3.12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఒక్క సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోనే టికెట్ కలెక్టర్లు, స్టేషన్ మాస్టర్లు, లోకోమోటివ్ పైలట్లు, ట్రాక్ నిర్వాహకులు, టెక్నికల్ సిబ్బంది సహా పలు విభాగాల్లో 30 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగి అనర్థాలకు కారణం అవుతున్నదని, కాబట్టి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.