యాదాద్రి: పవిత్ర శ్రావణమాసం మూడో శుక్రవారం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో లక్ష్మీ పూజలు అత్యంత వైభవంగా కొనసాగాయి. సాయం త్రం వేళలో ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలహలంగా నిర్వ హించారు. పరమపవిత్రంగా బావించే ఈ సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. లక్ష్మీ అమ్మ వారికి విశేష పుష్పాల తో ఆలంకారం జరిపారు.
బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా 516 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. దీన్నే సువర్ణ పుష్పార్చనగా భక్తులు అత్యంత ప్రీతికరంగా నిర్వహిస్తారు.
మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్ని ధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. ప్రధానార్చకుల ఆధ్వర్యంలోని అర్చక బృందం వైభవంగా ఈ పూజలు నిర్వహించా రు. ముత్తైదువులు మంగళహారతులతో అమ్మ వారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు.
తిరువీధి సేవ అనంతరం అమ్మ వారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలుఉ కోలాహలంగా కొనసాగింది. అష్టోత్తర పూజల్లో భక్తులు పాల్గొన్నారు.