హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ప్రతిష్ఠాత్మక 12వ వేటూరి కవితా పురస్కారం ప్రఖ్యాత కవి, గాయకుడు, పద్మశ్రీ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు లభించింది.
సినీ, గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి 88వ జయంతి సందర్భంగా సోమవారం ఏపీలోని కాకినాడ జిల్లా తునిచిట్టూరిలో నిర్వహించిన కార్యక్రమంలో వేటూరి సాహితీ పీఠం, ప్రకాశ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా ఆయనకు ఈ పురస్కారం అందజేసి, సన్మానించాయి. అవార్డుతోపాటు రూ.50వేల నగదు, 150 రకాల పుస్తకాలను గోరటి వెంకన్నకు బహూకరించారు.