హైదరాబాద్ : కామన్వెల్త్ గేమ్స్కు ఎన్నికైన నిఖత్ జరీన్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా గురువారం మొదలైన సెలక్షన్ ట్రయల్స్లో భాగంగా జరిగిన 50 కిలోల విభాగం తొలి బౌట్లో నిఖత్ 5-0 తేడాతో సవిత (హర్యానా)పై గెలుపొందింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ బౌట్లో 7-0 తేడాతో అనామికా (రైల్వేస్)పై భారీ విజయం సాధించింది.
శనివారం జరిగిన ఫైనల్ బౌట్లో 7-0 తేడాతో మీనాక్షి (హర్యానా)పై విజయం సాధించి.. కామన్ వెల్త్ గేమ్స్కు అర్హత పొందింది. జూలైలో లండన్, బర్మింగ్ హోమ్లో జరిగే పోటీల్లో పాల్గొననున్నది. ఈ సందర్భంగా పోటీల్లోనూ నిఖత్ విజయం సాధించాలని వెంకటేశ్వర్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నిఖత్ను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ యువతీ యువకులు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు.