మహబూబ్నగర్ : కొత్వాల్ రాజ బహదూర్ వెంకట రామారెడ్డి గొప్ప పరిపాలనాధక్షుడు. నిజాం కాలంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పని చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వెంకట రామారెడ్డి 154వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద వెంకట రామారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు.
రెడ్డి హాస్టల్ ద్వారా అనేక మందిని ప్రయోజకులను చేసిన ఘనత ఆయనది. ఎంతో మంది పేదలకు హాస్టల్స్లో ఆశ్రయం కల్పించి ప్రయోజకులను చేశారన్నారు. అతడిని ఆదర్శంగా తీసుకొని అనేక సామాజిక వర్గాలకు చెందినవారు హాస్టళ్లు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. పోలీస్ అకాడమీకి ఆ మహనీయుని పేరు పెట్టి గౌరవించుకుంటున్నాం. కొత్వాల్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తున్నాం. అలాగే
రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి స్వగ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు. పద్మావతి కాలనీ గ్రీన్ బెల్టు వద్ద మహనీయుల విగ్రహాలు ఉన్న ప్రాంతాన్ని రూ.2.50 కోట్లతో సుందరీకరిస్తాం. గ్రీన్ బెల్టు వద్ద వేమన విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి, చాకలి ఐలమ్మ, పాపన్న, దొడ్డి కొమరయ్య, పండుగ సాయన్న లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, రైతుబంధు సమితి డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, కౌన్సిలర్ కట్టా రవికిషన్ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు ఇంద్రసేనా రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, రాఘవ రెడ్డి, రాజేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, తదితరులు ఉన్నారు.
Venkata Rama Reddy , Minister Srinivas Goud,Telangana,Tribute