వేములవాడ : శ్రావణమాసం చివరి సోమవారం రాజన్నకు రికార్డుస్థాయిలో రూ.41 లక్షల ఆదాయం సమకూరింది. 75 వేల మందికి పైగా భక్తులు తరలిరావడంతో సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారి దర్శనానికి అనుమతించారు.
కోడె మొక్కుల టికెట్ల ద్వారా రూ.14.58 లక్షలు, ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ.12.33 లక్షలు, శీఘ్రదర్శనం టికెట్ల ద్వారా రూ.6.33 లక్షలు, మెయిన్ బుకింగ్ ద్వారా రూ.3.25 లక్షలు, ధర్మశాలల ద్వారా రూ. లక్షా 29 వేలు సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. గతంలో శ్రావణమాసంలోని ఏ సోమవారం కూడా ఇంత ఆదాయం సమకూరలేదని, అలాగే ఏ సోమవారం కూడా ఇలా రాత్రి 12 గంటల వరకు భక్తుల దర్శనానికి అనుమతివ్వలేదని తెలిపారు.