హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) జాతీయ ఉపాధ్యక్షుడిగా వరంగల్కు చెందిన వేముల సత్యమూర్తి ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం ముంబైలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారని, ఇందులో భాగంగా సత్యమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎ న్నికల అధికారి వెల్లడించారు.
ఈ సందర్భంగా వేముల సత్యమూర్తి మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.