భీమ్గల్, ఫిబ్రవరి 19: రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. నియోజకవర్గంలోని కప్పలవాగు, పెద్దవాగు పరీవాహక ప్రాంత రైతుల కోరిక మేరకు ప్యాకేజీ-21 ద్వారా మెంట్రాజ్పల్లి పంపుహౌస్, పెద్దవాగులోని చింతలూర్ అవుట్లెట్, కప్పలవాగులోని బెజ్జొరా అవుట్లెట్ పాయింట్ల నుంచి పెద్దవాగు కప్పల వాగులోకి నీటిని విడుదల చేయాలని కోరారు.
ఈ మేరకు ఆయన భీమ్గల్లో సీఈ మధుసూదన్రావు, ఈఈ భానుప్రకాశ్తో సోమవారం ఫోన్ద్వారా మాట్లాడారు. రెండు వాగుల్లోకి ఈ నెల 21 నుంచి మార్చి 10 వరకు 300 క్యూసెక్కుల చొప్పున నీళ్లు వదలాలని, దీంతో వాగులకు ఇరువైపులా ఉన్న బోర్లలో నీరు చేరి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. వెంటనే నీటి విడుదల చేపట్టాలని కోరుతూ రైతుల తరపున వేముల ఇరిగేషన్ అధికారులకు లేఖ రాశారు.