Minister Vemula | వేల్పూర్, సెప్టెంబర్ 20: పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కాంగ్రెస్వాది కాదని, చంద్రబాబు వాది అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ‘కాంగ్రెసోళ్లవి బక్వాస్, బోగస్, అర్రాస్ పాటల హామీలు. తెలంగాణలో అది చేస్తాం.. ఇది చేస్తామని చెబుతుండ్రు కదా.. మరీ ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఆయా పథకాలు ఎందుకు అమలు చేయరు?’ అని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలను అందించారు. అలాగే, భీమ్గల్ మండలం దేవక్కపేట్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ రాజగంగారాం ఆయన అనుచరులు, బీజేపీకి చెందిన లకావత్ సంతోష్ సహా 50 మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పాలనలో కర్ఫ్యూలు, కరెంట్ కోతలే ఉండేవని, పైరవీకారులదే రాజ్యమని అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు వచ్చి ఏదో చేస్తామని చెప్తున్నారని, అన్ని బక్వాస్, బోగస్, అర్రాస్ పాటల హామీలేనని మండిపడ్డారు. వాళ్లు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఈ హామీలేవీ అమలు చేయరు కానీ ఇక్కడకు వచ్చి మాత్రం సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయమాటలతో మభ్యపెట్టే వారి వల్ల ఆగం కావొద్దని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసేది చెప్తారని అన్నారు. కాంగ్రెసోళ్ల మాదిరిగా అలవికాని వాగ్దానాల జోలికి వెళ్లకుండా ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసిన ఘనత కేసీఆర్దేనని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తున్నాయని కొంతమంది ఊర్ల మీద పడి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ మధ్యలో వచ్చిన వారి ఆధిపత్యంతో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు విసిగిపోతున్నారని, కేసీఆర్ పాలనపై ఆలోచన చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ సీనియర్ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు.
భీమ్గల్, సెప్టెంబర్ 20: వచ్చే ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మద్దతుగా ఉంటామని కుల సంఘాల వారు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. బు ధవారం భీమ్గల్ మండలంలోని ముచ్కూర్కు చెందిన శాలివాహన కుమ్మరి సంఘం, మేదరి, ఏ1 మున్నూరు కాపు, మత్స్యపారిశ్రామిక, యాదవ, పద్మశాలీ సంఘాల సభ్యులు, పల్లికొండకు చెందిన గంగం సంఘం, చిన్న ఎనుపోతుల, గొల్ల కుర్మ, పరిపూర్ణానంద సంఘం సభ్యులు, ఏర్గట్ల మండలం బట్టాపూర్కు చెందిన క్రైస్తవులు ఏకగీవ్ర తీర్మానాలు చేసిన స్థా నిక ప్రజాప్రతినిధులు, నాయకులకు అందజేశారు.