నల్లగొండ : ఉద్యమ నేత కేసీఆర్(KCR) పోరాట ఫలితంగానే తెలంగాణ వచ్చింది. 14 ఏళ్లు ఉద్యమాలు చేసి పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి వేములు ప్రశాంత్రెడ్డి(Vemula Prashanth Reddy) అన్నారు. సోమవారం మిర్యాలగూడ(Miryalaguda) నియోజకవర్గంలో జరిగిన ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. వందేళ్లలో జరగని అభివృద్ధి పదేళ్లలోనే కేసీఆర్ చేసి చూపించారు.
మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం 1.8% ఓట్లు మాత్రమే తేడాతో కాంగ్రెస్ గెలిచిందన్నారు. అసత్య ప్రచా రాలతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోకపోవడం వల్ల బీఆర్ఎస్కు స్వల్పంగా నష్టం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లోని 14 వేల కోట్ల అప్పులు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అప్పులు చేశాడో ప్రజలకు వివరించాలన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చలేని రండ రేవంత్ రెడ్డి అని ఆక్షేపించారు.
బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం నీ గురువు చంద్రబాబు వల్లనే కాలేదు. రేవంత్ రెడ్డి నిన్ను ప్రజలే బొంద పెట్టే రోజులు ముందున్నాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగే సంసారం కాదన్నారు. ఇది ఎప్పుడు కూలుతుందో వారికే తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కూల్చాలని చూడటం లేదన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన కేసీఆర్ను రండ అని అంటున్న రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి అమలు చేయ లేని రండవి నువ్వే అని విమర్శించారు. రాబోయే ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.