హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రవేశపెట్టిన 102 లేదా అమ్మ ఒడి వాహనాలు గర్భిణులు, బాలింతలకు వరంగా మారాయి. ఒకప్పుడు ఏఎన్సీ చెకప్కు వెళ్లడం శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ.. అమ్మఒడి వాహనాలతో పైసా ఖర్చు లేదు. కాబోయే అమ్మలకు శ్రమ తగ్గింది. దవాఖానకు సులభంగా, సురక్షితంగా వెళ్లగలుగుతున్నారు. ప్రసవం అయితే తల్లీ, బిడ్డ సురక్షితంగా ఆ వాహనంలోనే ఇంటికి చేరుతున్నారు.
నెల ట్రిప్పులు లబ్ధిదారులు
మార్చి 41,453 1,13,625
ఏప్రిల్ 41,018 1,24,591
మే 40,817 1,24,516