కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి
జైనూర్లో రక్తదాన శిబిరం
ప్రపంచ రక్తదాతల దినోత్సవం
జైనూర్, జూన్ 14 : కరోనా విపత్కర పరిస్థితుల్లో అన్ని దవాఖానల్లో రక్త నిల్వలు తగ్గాయని, యువకులు మందుకు వచ్చి రక్తదానం చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జైనూర్ ప్రభుత్వ దవాఖానలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం మండలకేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద వర్షపునీటితో రోడ్డు బురదమయం కాగా, పరిశీలించా రు. స్థానికులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్రావ్, ఎంపీపీ కు మ్ర తిరుమల, సీఐ హనోక్, ఎస్ఐలు తిరుపతి, విష్ణువర్థన్, సహకార సంఘం చైర్మన్ కొడప హ న్నుపటేల్, ఎంపీడీవో ప్రభుదయ, మండల వై ద్యాధికారి సిడాం నాగేంద్ర, సర్పంచ్లు మడావి భీంరావ్, పార్వతి లక్ష్మణ్, నాయకులు జాడి రవీందర్, మిత్ర వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఆడ వెంకటేశ్, సన్రైజ్ ఫౌండేషన్ ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షుడు ముజాహిద్ తదితరులున్నారు.
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీలో..
మంచిర్యాల ఏసీసీ, జూన్ 14 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీలో జిల్లా చైర్మన్ చందూరి మహేందర్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాత దినోత్సవం నిర్వహించారు. 2008 నుంచి 972 శిబిరాల ద్వారా 85,065 మందికి రక్తదానం చేశామని, 200 మందికి పైగా పిల్లలకు 15 రోజులకోసారి రక్తం ఎక్కిస్తున్నామని వెల్లడించారు. శిబిరాలు ఏర్పాటు చేసిన సేవా కేం ద్రాలు, ప్రభుత్వ సంస్థలు, పోలీసులు, సింగరేణి కార్మికులు, అసోసియేషన్ సభ్యులు, రాజకీయ, పట్టణ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తలసేమియా, సికిల్సెల్ పిల్లలు, వారి తల్లిదండ్రులకు పండ్లు పంపిణీ చేశారు.రాష్ట్ర కమిటీ, జిల్లా మేనేజింగ్ కమిటీ మెంబర్ వీ రాధాకృష్ణ, జిల్లా కమిటీ మెంబర్లు ఎడ్ల కిషన్, సత్యపాల్ రెడ్డి, రహీం, ప్రేమ్సింగ్ పాల్గొన్నారు.