Basara Temple: నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో ఇవాళ ఘనంగా వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయి. మంగళవారం వేకువ జామునే శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వసంత పంచమిని పురస్కరించుకుని భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే అక్షర శ్రీకార పూజలు మొదలయ్యాయి. కాగా, భక్తుల రద్దీ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.