వరంగల్ : వరంగల్ భద్రకాళి ఆలయంలో(Bhadrakali Temple) వసంత నవరాత్రి ఉత్సవాలు(Vasantha Navratri )ఘనంగా జరుగుతున్నాయి. 9రోజుల పాటు వివిధ రకాల పూలతో పుష్పార్చన చేయనున్నారు. వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు(Divotees) ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.