యాదగిరిగుట్ట ;యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా జరిగాయి. కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలో లక్ష్మీ అమ్మవారిని దివ్య మనోహరంగా అలంకరించి వేడుకను జరిపారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 200 మంది మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి దంపతులు, ఈవో ఎన్ గీత, డీఈవో దోర్భాల భాస్కర్శర్మ, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన పురోహితులు గౌరిభట్ల సత్యనారాయణ శర్మ, శివాలయ ప్రధానార్చకుడు గౌరిభట్ల నరసింహరాములు శర్మ, అర్చకులు పాల్గొన్నారు.