మనోహరాబాద్, జూలై 12 : ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ వదులుతున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలని గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయి పల్లి గ్రామంలో ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఒకరోజు దీక్ష నిర్వహించారు.
ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ కాలుష్యాన్ని వదలడంతో గాలి నీరు కలుషితమై ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. కాలుష్యంతో వ్యవసాయ పంటలు నష్టం జరుగుతుందని దీంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీరు కలుషితమై రంగాయి పల్లి చెట్ల గౌరారం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. వ్యవసాయ బోర్లలో కలుషితమైన నీరు రావడంతో తాగునీటి సమస్యతో పాటు పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
పరిశ్రమలు ఒకరికి కూడా ఉపాధి ఇవ్వడం లేదని బీహార్ తో పాటు ఇతర రాష్ట్రాల వరకు చెందిన వారికి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. ఉపాధి లేని పరిశ్రమలు ఇక్కడ ఎందుకని, ఇక్కడి వనరులు ఉపయోగించుకొని స్థానికేతరులకు ఉద్యోగాలు కనిపిస్తున్నారని తెలిపారు. పరిశ్రమ అనుమతులు రద్దు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.