కొండపాక(కుకునూరుపల్లి), ఏప్రిల్ 3: పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి నిరుద్యోగ సమస్యపై చిత్తశుద్ధి ఉంటే గజ్వేల్లో కాదు ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో సభ పెట్టాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సవాల్ చేశారు. ఏటా 2 కోట్ల ఇస్తామన్న హామీని నెరవేర్చని ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని హితవు చెప్పారు. సోమవారం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్గాంధీపై అనర్హత వేటు వేస్తే కాంగ్రెస్ నాయకులు ఎక్కడా ఉద్యమించలేదని, ఇందుకు నైతిక బాధ్యత వహించి పీసీసీ పదవికి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్కి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే బయ్యారం కర్మాగారం, తెలంగాణకు నిధులు తీసుకురావాలని సవాల్ చేశారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ లబ్ధ్ది పొందాలని చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు రేవంత్రెడ్డి, బండి సంజయ్ సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్నారని, వారికి రాష్ట్ర బాగోగులపై పట్టింపు లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.