నల్లగొండ రూరల్, డిసెంబర్ 9 : మాదిగ జాతి అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. 28 ఏండ్ల తమ న్యాయమైన వర్గీకరణ డిమాండ్ను గతంలో కాంగ్రెస్, ఇప్పుడున్న బీజేపీ పట్టించుకోలేదని విమర్శించారు.
మాదిగలను ఓటు బ్యాంకుగా చూస్తూ మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతూ దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని కొనియాడారు.