ముషీరాబాద్, జనవరి 29: మాదిగల చిరకాల కోరిక, న్యాయమైన ఎస్సీ వర్గీకరణ డిమాండ్ను పరిష్కరించకుండా కాంగ్రెస్, బీజేపీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. సోమవారం విద్యానగర్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సంఘం కోర్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. బీజేపీకి మాదిగల పట్ల ఏ మాత్రం అభిమానం ఉన్నా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు.