ముషీరాబాద్, డిసెంబర్ 12: బుధవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
విద్యానగర్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా మాదిగ, ఉపకులాల ప్రజలు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారని, ప్రభుత్వాలు మారి నా వర్గీకరణ అంశాన్ని తేల్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సభ ల్లో వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి వర్గీకరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డి మాండ్ చేశారు. సమావేశంలో టీ ఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ మీసాల మల్లేశ్, నాయకులు గణేశ్, హుస్సేన్, యాదగిరి, గోపాల్, రజిని, నాగమణి పాల్గొన్నారు.