ఖమ్మం: ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పద్మశ్రీ వనజీవి రామయ్య (Vanajeevi Ramaiah) గాయపడ్డారు. స్థానికులు ఆయనను దవాఖానకు తరలించారు. రామయ్య.. బుధవారం ఉదయం పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా మరో బైక్ వచ్చి రామయ్యను ఢీకొట్టింది. దీంతో ఆయన కాలుకు గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కాగా, వనజీవి రామయ్య ఇప్పటికే అనారోగ్యంగా ఉన్నారు. ఆయన కాలికి దెబ్బతగలడంతో సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. తాజాగా ఆయన మరోసారి గాయపడ్డారు.