కేంద్రం వల్లే ఆలస్యం: మంత్రి నిరంజన్రెడ్డి
వాల్మీకి బోయలు ఆర్థికంగా, సామాజికంగా బాగా చితికిన కుటుంబాలు. కొన్ని రాష్ర్టాల్లో వారిని ఎస్సీ, ఎస్టీలుగా గుర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో వారిని ఎస్టీల్లో చేర్చాలని ఉద్యమాలు, చర్చలు జరిగాయి. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేసింది. 2016లో వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేయగా, అవసరమైన చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరాం. ఇప్పటివరకు పట్టించుకొన్న పాపానపోలేదు. తదుపరి నిర్ణయం కేంద్రం చేతుల్లోనే ఉన్నది.
వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలి: శ్రీనివాస్గౌడ్
సీఎం కేసీఆర్ వాల్మీకి బోయల పోరాటాలు గుర్తించి వారికి మేలు చేశారు. గతంలోనూ ఎస్టీల్లో చేర్చాలని ఎన్నో పోరాటాలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ-ఏలో కలిపి అన్యాయం చేశారు. ఇన్నేండ్లుగా ఆ జాతి నష్టపోయింది. వారి బాధలను సీఎం కేసీఆర్ ఒక్కరే అర్థం చేసుకొని సమస్యను పరిష్కరించారు. వాల్మీకి జాతి కేసీఆర్కు రుణపడి ఉంటది. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని కేంద్రం వెంటనే ఆమోదించాలి.
కేసీఆర్కు కృతజ్ఞతలు: ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి
వాల్మీకీలను ఎస్టీలో చేర్చేందుకు అసెంబ్లీ తీర్మానం చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. ఇన్నేండ్ల వారి పోరాటం స్వరాష్ట్రంలో ఫలించింది. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం వెంటనే ఆమోదించాలి. ఈ పోరాటంలో కలిసివచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఇతర ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు.
రేవంత్కు కోట్లు ఎట్లొచ్చినయ్ ?: రెడ్యానాయక్
నేను, నా కూతురు భూముల కోసం పార్టీ మారామంటూ రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసే బీఆర్ఎస్లో చేరాం. కాంగ్రెస్కు మరో 20 ఏండ్ల వరకు భవిష్యత్ లేదు. నాకు హైదరాబాద్లో భూమి ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేకపోతే రేవంత్రెడ్డి 10 చెప్పు దెబ్బలు తింటావా? నువ్వొక బ్లాక్మెయిలర్వి. డబ్బులిచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నవాడివి. గోడలకు రంగులేసిన రేవంత్రెడ్డి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు?