హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్చార్జి ఉపకులపతిగా ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం వాకాటి కరుణ విద్యాశాఖ కార్యదర్శిగా, కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖలకు ఇన్చార్జి కమిషనర్గా కొనసాగుతున్నారు.
ఇదివరకు వర్సిటీ వీసీగా ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ గుప్తా ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు పరీక్షాకేంద్రాన్ని మంజూరు చేయడానికి రూ.50 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీకి పట్టుబడ్డ విషయం తెలిసిందే. హైకోర్టు అనుమతి మేరకు ప్రభుత్వం వర్సిటీ ఇన్చార్జి వీసీగా వాకాటి కరుణను నియమించింది. కాగా, ఏసీబీ కేసులో జైలుకు వెళ్లిన రవీందర్ గుప్తాకు ఇటీవలే బెయిల్ మంజూరైంది.