హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుంచి 11 వరకు సామాన్య భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
టీటీడీ అదనపు ఈవో వీరబ్రహ్మంతో కలిసి గురువారం తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, సర్వదర్శనం క్యూలైన్లు, పీఏసీ-4 తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించా రు. భక్తులు తిరుపతిలో టైమ్ స్లాట్ టోకెన్లు పొంది, వైకుంఠ ద్వార దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నదని అధికారులు తెలిపారు.
గురువారం సీజేఐ చంద్రచూడ్ దంపతులకు స్వామివారి చిత్రపటాన్ని అందజేస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్