V Hanumantha Rao | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని వీహెచ్ ఆరోపించారు. రేవంత్ కొంత మంది నాయకుల వద్దకు వెళ్లి.. తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని పేర్కొన్నారు.
రేవంత్తో చాలా విషయాలు మాట్లాడాలి. అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడం లేదు. తక్కువ టైమ్లో సీఎం అయింది రేవంత్ రెడ్డి ఒక్కరే. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించింది కూడా ఆయనే అని స్పష్టం చేశారు. కానీ తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూసి కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ క్యాడర్కు న్యాయం చేయకుండా.. పార్టీలు మారి వస్తున్నవారికి రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్క సైడ్ వినకుండా రెండు సైడ్స్ వినాలని కోరుతున్నా. పార్టీ కార్యకర్తలలకు అన్యాయo చేయకండి. తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు ఎవ్వరికి అన్యాయం జరగొద్దనేది తన ఆవేదన అని వీ హనుమంతరావు స్పష్టం చేశారు.