హైదరాబాద్, సెప్టెంబర్19 (నమస్తే తెలంగాణ) : సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 22న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్సాయితో రాష్ట్ర ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి భేటీ కానున్నారు. సమ్మక్కసాగర్ బరాజ్కు కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు రావాల్సి ఉన్నది.
ఇందుకుగాను పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ)ఇవ్వాల్సి ఉన్నది. ఈ బరాజ్తో దాదాపు 136 ఎకరాలు ముంపునకు గురవుతుందని ఛత్తీస్గఢ్ ఆరోపిస్తూ ఎన్వోసీ జారీకి కాలయాపన చేస్తున్నది. అయితే, తగిన పరిహారం చెల్లిస్తామని ఇప్పటికే ఛత్తీస్గఢ్కు హామీ ఇచ్చారు.
హైదరాబాద్, సెప్టెంబర్19 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి రూ.35 వేల కోట్లతో ప్రభుత్వం ఎలాంటి అంచనాలను రూపొందించలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. అంచనాలపై వస్తున్న వార్తల్లో నిజం లేదని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ్మడిహట్టి బరాజ్, చేవేళ్ల-ప్రాణాహిత ప్రాజెక్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.35 వేల కోట్లతో అంచనాలు రూపొందించామనేది మాత్రం అబద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వం అంచనాల ప్రక్రియ మొదలుపెట్టలేదని, అంచనాలు రూపొందిస్తే అధికారికంగా ప్రకటిస్తుందని పేర్కొన్నారు.