నిర్మల్: వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నదని చెప్పారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్లో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంటాలను గ్రామాల్లోనే ఏర్పాటు చేసి వరి పంటను కొనుగోలు చేస్తున్నామన్నారు. దీలావర్పూర్ మండలంలో 5 వేల ఎకరాల్లో వరి సాగు చేశారన్నారు. దాని విలువ రూ.25 కోట్లు ఉంటుందని చెప్పారు. నిర్మల్ జిల్లాలో గతంలో కంటే వరి సాగు చాలా పెరిగిందన్నారు.