హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధరలు దించేదాకా మా ఆందోళన కొనసాగుతుంది . కేంద్రం వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, ఎల్.రమణ, దండే విఠల్, ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ దేశాన్నీ ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్, బీజేపీ పార్టీలే. ఆ రెండు పార్టీలు పాలించిన దాని కన్నా సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతులకు ఎక్కువ న్యాయం జరుతుందుని మంత్రి తెలిపారు. రైతు నాయకులుగా ముద్ర పడ్డ దేవిలాల్, చరణ్ సింగ్ల కేంటే ఒక పాలు ఎక్కువగానే కేసీఆర్ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ మాత్రం రైతుల పట్ల కక్ష కట్టి పాలిస్తోందన్నారు. బీజేపీ రైతాంగ వ్యతిరేక విధానాలపై కేసీఆర్ ఉద్యమానికి నడుం బిగించారని తెలిపారు. ఎరువుల ధరల పెంపు ఇతర అంశాల పై పీఎం మోదీకి కేసీఆర్ లేఖ రాశారు.
బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ఇప్పటికే రైతుల నడ్డి విరిచిందని మండిపడ్డారు. ఇపుడు రైతులను ఇబ్బంది పెట్టేలా ఎరువుల ధరలు పెంచారు. బీజేపీ నేతలు సిగ్గు లేకుండా ఎరువుల ధరలు పెంచడాన్ని సమర్ధించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
2 లక్షల 71 వేల కోట్ల రూపాయలు రైతులకు వెచ్చించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయమని మోదీని కోరి ఐదేళ్లు అవుతున్నా ఉలుకు లేదు పలుకు లేదని వివమర్శించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు. టీడీపీలో ఉన్నపుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాల పై పోరాడ లేదా అని ప్రశ్నించారు.
ఇపుడు కాంగ్రెస్లో ఉండి అప్పటి ప్రభుత్వం రైతులకు ఏదో మేలు చేసిందని రేవంత్ చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. శ్రీరామ్ సాగర్ ఆయకట్టును ఎండబెట్టింది కాంగ్రెస్ పాలన కాదా
అని సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయం సర్వ నాశనం కావడానికి కాంగ్రెస్, బీజేపీ విధానాలే కారణమని నిప్పులు చెరిగారు.
ప్రెస్ మీట్లతో డ్రామాలు చేయడం రేవంత్రెడ్డికి అలవాటే
నని, దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఏం చేశారో చెప్పాలని, తర్వాత చర్చకు వచ్చే దాని గురించి మాట్లాడాలన్నారు.
ప్రతిపక్షాలు కేసీఆర్ను పొగడకున్నా పర్వా లేదు. తిడితే పాపం తగులుతుందన్నారు. రైతులకు కేసీఆర్ ఎంతో చేసిన మహానుభావుడని కొనియాడారు.ఇంకా ఎంతో చేస్తారు. కరోనా వచ్చి కొన్ని ప్రతిపాదనలు ఆగిపోయాయి.
ముందు ముందు అన్ని పనులు జరుగుతాయన్నారు. ఏం చేయని పార్టీలు మమ్మల్ని అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు. బండి సంజయ్ కేసీఆర్ను అరెస్టు చేస్తామంటు న్నారు. కేసీఆర్ను టచ్ చేస్తే బీజేపీ నేతలను ఉరికించి కొడతారని హెచ్చరించారు.