నల్లగొండ: జిల్లాలోని చింతపల్లి మండలంలో దారుణం జరిగింది. మండలంలోని విరాట్నగర్లో ఉన్న మెట్టు మహంకాళి ఆలయం వద్ద దుండగులు మొండెం లేని తలను వదిలివెళ్లారు. సోమవారం ఉదయం తలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలిస్తున్నారు.
క్లూస్ టీమ్ను సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి ఆలయం వద్ద నరబలి జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.