హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రైతుల ప్రయోజనాల కోసం ఢిల్లీ వేదికగా పోరాటంచేస్తున్న రాష్ట్ర మంత్రులు, ఎంపీలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనుచిత వ్యాఖ్యలుచేశారు. ఈ పోరాటాన్ని కించపరిచే విధంగా అవహేళనచేసేలా మాట్లాడారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో ‘తెలంగాణ మంత్రులకు, ఎంపీలకు ఏం పనిలేదు.. పదే పదే ఢిల్లీకి ఎందుకు వస్తున్నారు.. వాళ్లకు తెలంగాణ ప్రజలకు సేవ చేయడం కన్నా.. ఢిల్లీలో ఉండటమే ఇష్టంగా ఉన్నట్లుంది’ అంటూ కించపరిచే వ్యాఖ్యలుచేశారు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నేరుగా మంత్రులతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు, ఎంపీలు ఢిల్లీ బాట పట్టేందుకు కారణమెవరనే విషయాన్ని పక్కనపెట్టి చిత్తం వచ్చినట్టు మాట్లాడారు. రైతులతో రాజకీయంచేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీపై పోరాటానికి దిగింది. రైతులకోసం ఢిల్లీకే కాదు ఇంకెక్కడికైనా, ఎన్నిసాైర్లెనా వెళ్లేందుకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా తమకు రాజకీయం ముఖ్యం కాదని ఎప్పుడో తేల్చిచెప్పింది. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎంపీలు పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా వారంపాటు పోరాడారు. హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద సీఎం కేసీఆర్తో సహా పార్టీ శ్రేణులంతా ధర్నా నిర్వహించారు. ఈ విధంగా రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తుంటే.. రాజకీయాలు చేస్తున్న కేంద్ర మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.
ఇప్పటివరకు ధాన్యం కొనుగోలుపై