ములుగు :మేడారం మహా జాతర(Medaram) సందర్భంగా సమ్మక్క, సారలమ్మలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy) వనదేవతలను దర్శించుకున్నారు. తల్లులకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడి పంటలతో దేశం అంత సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాని తెలిపారు.
అలాగే ములుగులో గిరిజన వర్సిటీ(Tribal University) తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీ ఆధ్వర్యంలో గిరిజన వర్సిటీ పని చేస్తుందని తెలిపారు. మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారు. జాతీయ పండుగ విధానం అనేది ఎక్కడా లేదన్నారు. మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తామన్నారు.