వరంగల్ : భద్రకాళి( Bhdrakali temple) అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం దర్శించుకు కున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. స్వామి వారి తీర్థ ప్రసా దాలు అందజేశారు.
కాగా, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల దేవాలయ కల్యాణ మండపాన్ని రాష్ట్ర మంత్రులతో కలిసి పునఃప్రారంభించారు. అనంతరం యాగశాలలో శాంతి హోమం చేశారు. అలాగే ములుగు జిల్లాలోని జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్లో సమ్మక్క, సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ను ప్రారంభించారు.