హనుమకొండ : హనుమకొండలోని కాకతీయుల కాలం నాటి శ్రీ రుద్రేశ్వర స్వామివారి వేయిస్తంభాల గుడి(Thousand Pillar Temple) కల్యాణ మండపం పనులు పూర్తయ్యాయి. కొన్ని స్తంభాలను కొత్తగా నిర్మించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. మంగళవారం వేయి స్తంబాల గుడి మండపం పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రామప్ప దేవాలయాన్ని రూ. 60 కోట్లతో అభివృద్ధి చేసి పర్యాటకులకు వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వరంగల్ పోర్టుకు నూతన లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నాం. ట్రైబల్ సర్క్యూట్ పేరుతో పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో గెస్ట్ హౌస్లు, బోట్లు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించామన్నారు. అలాగే ములుగులో సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.