పెద్దపల్లి, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి(Peddapalli) బీజేపీ అభ్యర్థి దుగ్యాల ప్రదీప్కుమార్కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్షా(Amit Shah) సకల జనుల విజయ సంకల్ప రోడ్డుషో(Road show) పెద్దపల్లిలో అట్టర్ ఫ్లాప్ అయింది. 10 గంటల వరకు జనసమీకరణకు ప్లాన్ చేసిన బీజేపీ నాయకులు అనుకున్నదొక్కటి.. అయిందొకటి అయ్యింది. వాళ్ల అంచనాల దరిదాపుల్లోకి కాదుక కదా.. కనీసం సగానికి సగం సైతం ప్రజలు రాలేదు. కేవలం 3వేల మంది వరకు మాత్రమే హాజరు కావడంతో చావు తప్పి కన్నులొట్ట పోయిన చందంగా తయారయింది.
దీనికి తోడు కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్షా హాజరు కాగా ఆయన ఎక్కిన ప్రచార రథం మొరాయించడం బీజేపీ శ్రేణులను మరింత కుంగదీసింది. పెద్దపల్లి కమాన్ వద్దకు చేరుకున్న అమిత్షాకు అభ్యర్థి ప్రదీప్కుమార్తో పాటుగా ఆ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఆ తర్వాత కమాన్ వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ ప్రచార రథంపైకి అమిత్షా ఎక్కగా.. కొద్ది దూరం పాటు వెళ్లిన తర్వాత వాహనం నిలిచిపోయింది. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నెట్టినప్పటికీ అది స్టార్ట్ కాలేదు. దీంతో మరో వాహనంలో అమిత్షా జెండా చౌరస్తాకు చేరుకున్నారు.
అక్కడ రోడ్డుషో 5నిమిషాల పాటు చప్పగా సాగింది. కాగా, నియోజకవర్గంలోని సుల్తానాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హాజరు కాగా ఆ రోడ్డు షోకు దాదాపుగా 10వేలకు పై తరలివచ్చారు. జిల్లా కేంద్రంలో బీజేపీ అభ్యర్థి ప్రదీప్కుమార్కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్షా హాజరు కాగా నియోజకవర్గ కేంద్రంలో జనం లేకపోవడంతో రోడ్షో వెలవెల బోయింది.
దీనికి తోడు అమిత్షా పర్యటనకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ నాయకుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, మరో జాతీయ నాయకుడు మీస అర్జున్రావుతో పాటు మరికొంత మందికి దూరంగా ఉన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో పెట్టక పెట్టక ఒక్క రోడ్డు షో పెడితే అది అట్టర్ ఫ్లాఫ్ కావడంతో అభ్యర్థితో పాటుగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా నిస్తేజంలోకి వెళ్లిపోయారు.