Amit Shah | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అనుకున్న సీట్లు సాధించలేదని.. 30 సీట్లు వస్తాయని ఆశించామని పేర్కొన్నారు. వర్గ విభేదాల కారణంగానే నష్టపోయామని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా.. హైదరాబాద్లోని నోవాటెల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వర్గ విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
లోక్సభ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బీజేపీ నేతలను అమిత్ షా ఆదేశించారు. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషిచేయాలని సూచించారు. సిట్టింగ్ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశమిస్తామని పేర్కొన్నారు. ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తామని తెలిపారు.