రైతులకు అండగా నిలుస్తూ.. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. తెలంగాణ ప్రభుత్వ డిమాండ్కు కేంద్రం దిగొచ్చింది. సీఎం కేసీఆర్ కృషి, మంత్రుల దౌత్యం ఫలించింది. ఖరీఫ్ సీజన్(వానా కాలం పంట)కు సంబంధించి రాష్ట్రం నుంచి అదనంగా బియ్యం సేకరించేందుకు కేంద్రం అంగీకరించింది.
రాష్ట్రం నుంచి మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించినున్నట్లు లేఖ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. గతంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బియ్యం సేకరణకు కేంద్రం ఒప్పుకున్నది. తాజాగా మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరిస్తామని తెలిపింది. దీంతో ఖరీఫ్లో 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్రం తీసుకోనుంది. కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో 68.65 లక్షల టన్నుల ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం సేకరించనుంది.