బీజేపీ పాలిత ప్రాంతంలో ఉపాధి లేక వలస
గన్నేరువరం, జూలై 15: బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఉపాధి లేక చాలామంది కూలీలు తెలంగాణకు వలస వస్తున్నారు. ఒకప్పుడు ఉపాధి లేక ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లిన ఇక్కడి వారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన చర్యలతో వలసలకు చెక్ పడింది. అంతేకాకుండా ఇతర రాష్ర్టాల వారు మన రాష్ర్టానికి రావడం ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయనడానికి నిదర్శనం.
ప్రస్తుతం రాష్ట్రంలో వరినాట్లు ఊపందుకోవడంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో రైతులు ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న కూలీలతో నాట్లు వేయిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ మండలం గన్నేరువరం మండలం చీమలకుంటకు చేరిన 20 మంది బీజేపీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్కు చెందిన మగ కూలీలు వరి నాట్లు వేస్తున్నారు. రోజుకు రూ.600 నుంచి రూ.700 వరకు సంపాదిస్తున్నారు.