సారంగాపూర్, ఆగస్టు 13 : జగిత్యాల జిల్లా బీర్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ వద్ద ఆర్ఐ రాహుల్ 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్రెడ్డి వివరాల ప్రకారం.. బీర్పూర్లోని సిరిపురానికి చెందిన ఒంటెల మణెమ్మ మోతీనగర్, గంగసముద్రం, నూతిపల్లిలో 12 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసింది. భూభారతిలో 12 గుంటల భూమిని పట్టా చే యాలని దరఖాస్తు చేసింది.
విచారణ చేపట్టి రిపోర్ట్ ఇవ్వాలని తహసీల్దార్ గతేడాది జూలై 12న ఆర్ఐ రాహుల్ను ఆదేశించారు. భూ విచారణ కు సంబంధించి ఆర్ఐని మ హిళ కలువగా రూ.50 వేలు డిమాండ్ చేశాడు. రూ.40 వేలకు ఒప్పందం చేసుకుని, ముందుగా రూ.30 వేలు ఇవ్వాలని, పాస్బుక్ వచ్చిన తర్వాత రూ.10 వేలు ఇవ్వాలని చెప్పాడు. గురువారం ఆర్ఐ రాహుల్ మహిళ నివాసం ఉంటున్న ప్రాంతంలో ఆమె నుంచి రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆర్ఐని కోర్టులో రిమాండ్ చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు.