సుల్తాన్బజార్,సెప్టెంబర్ 22: నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా 9 రోజులుగా అశోక్ చేపడుతున్న నిరాహార దీక్షకు సిటీ సెంట్రల్ లైబ్రరీ నిరుద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఉస్మానియా దవాఖాన ఆవరణలో నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈక్రమంలో నిరుద్యోగులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ.. అశోక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని, 9రోజులుగా దీక్ష చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. తక్షణమే ప్రభు త్వం అశోక్తో చర్చలు జరిపి, ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్చేశారు. అశోక్ ప్రాణాలకు హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగులు వెంకటేశ్, శంకర్నాయక్, గణేశ్, ప్రత్యూ ష, ఇంద్ర, అనిల్, అష్మ, సురేశ్, సంపత్, మధు పాల్గొన్నారు.