ఎల్బీనగర్, జూన్ 10 : ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీలో రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై నిరుద్యోగులు సమరశంఖం పూరించారు. ఉద్యోగాల కో సం పోలీస్ నిరుద్యోగ జేఏసీ విద్యార్థులు రోడ్డెక్కారు. కేవలం 5 వేల పోలీస్ ఉద్యోగాలకే నోటిఫికేషన్లు ఇ వ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీస్ శాఖ లో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్తో బుధవారం దిల్సుఖ్నగర్ చౌరస్తాలోని రోడ్లపైకి ని రుద్యోగ అభ్యర్థులు ఒక్కసారి వెల్లువలా వచ్చారు. ‘ఐదు వేల పోస్టులు వద్దు.. 20 వేల పోస్టులు కావా లి’ అంటూ బ్యానర్ పట్టుకుని పెద్ద పెట్టున నినాదా లు చేశారు. జేఏసీ నేతలు నవీన్ పట్నాయక్, ఆకాశ్, శంకర్, షింబూ నాయక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ నిరుద్యోగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కేవలం 5 వేల పోస్టులతో ఉద్యోగాలు భర్తీ చేస్తే సగం పోస్టు లు హైదరాబాద్లోనే భర్తీ చేస్తారని, మిగిలిన 2,500 పోస్టులు అన్ని జిల్లాలకు కేటాయిస్తే.. జిల్లా ల్లో కొందరికి కూడా ఉద్యోగాలు రావని ఆవేదన వ్యక్తంచేశారు. 2022 నుంచి 2026 వరకు ఒక్క పోలీస్ నోటిఫికేషన్ కూడా రాలేదని, వయోభారం పెరుగడంతో కానిస్టేబుల్కు 36, ఎస్ఐకి 38 ఏండ్ల వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. లాంగ్ జంప్ అంశంలో కూడా 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలని కోరారు. అధికారంలోకి రాకముందు ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్, తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నదని మండిపడ్డారు.
జేఏసీ నేతల అరెస్టు
పోలీస్ నిరుద్యోగ జేఏసీ ర్యాలీలో మద్దతుగా పాల్గొన్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్రానాయక్, బీఈడీ నిరుద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్యాకుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నారంటూ అభియోగం మోపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తుంటే పోలీసులు తమపై కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు.
లక్ష సంతకాల సేకరణ
పోలీస్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం చైతన్యపురిలోని అస్పెరెంట్స్ అడ్డా టీ షాపు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యానర్పై 20 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు కావాలంటూ నిరుద్యోగులు భారీ ఎత్తున సంతకాలు చేశారు.
నిరుద్యోగులను ముంచిన కాంగ్రెస్ సర్కార్: ఎర్రోళ్ల
ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ రెండున్నరేండ్లు దాటినా నిర్లక్ష్యం చేస్తూ నిండా ముంచుతున్నదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. నాడు నిరుద్యోగుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ ఇప్పుడు వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఒకవైపు సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ, విదేశీ పర్యటనల్లో మునిగితేలుతుంటే, ఉద్యోగాల జాడలేక నిరుద్యోగులు మాత్రం నిరాశలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.