రఘునాథపాలెం, ఫిబ్రవరి 7: ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వేపకుంట్ల, గణేశ్వరం గ్రామాల్లో మంగళవారం ‘మన ఊరు-మన బడి’ కింద ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి ప్రారంభించారు. వేపకుంట్లలో మంత్రి మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి’ ద్వారా సీఎం కేసీఆర్ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.